Revanth Govt | తనకు హిట్లర్ ఆదర్శమంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్లో దుమారాన్ని రేపాయో తెలిసిందే. తన పాలన ఎలా ఉందో స్వయంగా తానే చెప్పుకున్నట్టుగా ఈ కామెంట్స్ ద్వారా జనాలకు అర్థమైపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. రేవంత్ రెడ్డి పాలన నియంతలా సాగుతుందనడానికి సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన మరోసారి అద్దం పడుతోంది. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో గ్రామసభ ఏర్పాటు చేశారు. అయితే బాధితులను మాట్లాడనివ్వకుండా పోలీసుల బందోబస్తు నడుమ గ్రామసభను నిర్వహించారు.
అయితే గ్రామసభలో తమను మాట్లాడనివ్వకుండా సర్పంచ్ రవీంద్ర నరసింహ రెడ్డి అడ్డుకున్నాడని పరిహారం రాని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛగా జరగాల్సిన గ్రామసభలో ఈ ఆంక్షలేంటని ప్రశ్నించిన బాధితులు తమను ఎందుకు అడ్డుకున్నారని పోలీసులను నిలదీశారు. గ్రామసభ ముగిసినా హకీంపేట గ్రామం పోలీసుల వలయంలోనే ఉండటం రేవంత్ రెడ్డి పాలనకు పరాకాష్ఠగా నిలుస్తుంది.
రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నియంత పాలన
బాధితులను మాట్లాడనివ్వకుండా పోలీసుల బందోబస్తు నడుమ గ్రామసభ
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో జరిగిన గ్రామసభలో తమను మాట్లాడనివ్వకుండా సర్పంచ్ రవీంద్ర నరసింహ రెడ్డి అడ్డుకున్నాడని పరిహారం రాని బాధితుల ఆవేదన
స్వేచ్ఛగా జరగాల్సిన… pic.twitter.com/bjFnOQpWha
— Telugu Scribe (@TeluguScribe) August 22, 2026
Smart ration cards | తప్పులతడకగా స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ.. హరిపురంలో కార్డుల పంపిణీ నిలిపివేత