ఉప్పునుంతల/లింగాల, నవంబర్ 29: దళితుల అభ్యున్నతికే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉప్పునుంతల మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన నాగరాజుకు దళితబంధు పథకం కింద మంజూరైన సెంట్రింగ్ మెటీరియల్ను విప్ అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళతులకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టారన్నారు. అదేవిధంగా లింగాల మండలంలోని కొత్తకుంటపల్లి గ్రామానికి చెందిన కుర్మయ్య అనే కార్యకర్తకు దళితబంధు పథకం నుంచి మంజూరైన టెంట్హౌజ్ను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్రావ్, వార్డు సభ్యులు స్కైలాబ్, సుధాకర్, బాలరాజు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషిచేయాలి
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని మాడాపూర్ గ్రామశివారులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ కార్యకర్తల కృషి ఫలితంగా రాష్ట్రంలో పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గ అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో శ్రీఉమామహేశ్వర, చెన్నకేశవ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేస్తే తమకు పుట్టగతులుండవనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హన్మంత్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తిరుపతయ్య, సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కేటీ తిరుపతయ్య, మాజీ ఎంపీపీ మంజుల, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెంకట్రెడ్డి, రానోజీ, నాయకులు హన్మంతునాయక్, పర్వతాలు, అశోక్రెడ్డి, మల్లేశ్, శంకర్నాయక్ పాల్గొన్నారు.