Sun Stroke | వడదెబ్బతో కొడుకు మృతి చెందాడు.. తన కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి కూడా ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తూముకుంట గ్రామానికి చెందిన కుర్వ మల్లికార్జున్ (మల్లన్న) ఉదయం పంట పొలానికి వెళ్లాడు. పొలంగా పనిచేసుకుంటున్న సమయంలో మల్లికార్జున్కు వడ దెబ్బ తగిలి మృతి చెందాడు.
తన కొడుకు మరణ వార్తను విన్న మల్లికార్జున్ తల్లి కురువ రంగమ్మ మనోవేదనతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఓ వైపు కొడుకు.. మరోవైపు ఇక కొడుకు లేడన్న బెంగతో తల్లి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. నవమాసాలు మోసి కని పెంచిన ఆ తల్లి బిడ్డ లేకుండా బ్రతకలేక ఆయన వెంటనే వెళ్లిపోయిన ఘటన అందరి కంట కన్నీళ్లు తెప్పిస్తోంది.
Hyderabad | దారుణం.. జ్యూస్ అని చెప్పి నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Karepalli | రోడ్డు ప్రమాద నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
Loksabha: ఆ బిల్లులపై చర్చకు 251 మంది అనుకూలం.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్