జోగులాంబ గద్వాల : అర్హులందరికి రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందన్నారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలో 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీపీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సరోజమ్మ, పురపాలక చైర్మన్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
Tokyo Olympics : బాక్సర్ లవ్లీనా గ్రామంలో సంబురాలు
Rashmi Gautam: లంగా ఓణీలో హీటెక్కిస్తున్న యాంకర్ రష్మీ