వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరకాల పట్టణంలో పురుగుల మందు తాగి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు తాళ్లపల్లి కేశవ స్వామిగౌడ్(45), సంధ్యారాణి(40)గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. దుగ్గొండి మండలం పొనకల్ గ్రామానికి చెందిన ఈ దంపతులు ప్రార్థన కోసం పరకాలలోని ఓ చర్చికి వచ్చినట్లు తెలిసింది.
చర్చి సమీపంలో భార్య భర్తలిద్దరూ పురుగుల మందు తాగారు. వీరిలో సంధ్యారాణి అక్కడికక్కడే మృతి చెందగా స్వామి గౌడ్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. కేశవ స్వామి గౌడ్, సంధ్యారాణి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.