పంటల సాగులో సహజసిద్ధమైన ఎరువుల వినియోగంతోనే అధిక దిగుబడులు వస్తాయి. రసాయన ఎరువుల వాడకం అనర్థదాయకం. విచ్చలవిడిగా పురుగుల మందులు వినియోగిస్తుండడంతో భూసారం తగ్గిపోవడంతోపాటు పంట ఉత్పత్తులు విషతుల్యమవుతున్నాయి. వీటితో మనుషులకు నష్టం చేకూరుతున్నది. అందుకే కంపోస్ట్, సహజ సిద్ధంగా తయారు చేసిన కషాయాలను వినియోగించాలని రైతులకు వ్యవసాయ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.
– పెబ్బేరు, మే 18
పంటల సాగు విషయంలో జాగ్రత్తలు పాటించాలని, రసాయన ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడితే అనర్థదాయకమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అధిక దిగుబడి సాధించేందుకు రసాయన ఎ రువులు, పురుగుల మందులను విచ్చలవిడిగా వినియోగిస్తుండడంతో భూసారం క్షీణిస్తున్నది. పంట ఉత్పత్తులు కూడా విషతుల్యమవుతున్నాయి. రసాయనాల అవశేషాలు బియ్యపు గింజల్లో దాగి ఉంటున్నాయి. వాటిని తినడంతో కిడ్నీ, జీర్ణ వ్యవస్థలపై ప్రభావం పడుతుంది. పొలం వడ్డువరాలపై పెరిగిన పచ్చగడ్డి కూడా విషపూరితమవడంతో వాటిని మేయడం తో మూగజీవాల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉన్న ది. తెగుళ్లను అరికట్టేందుకు మోనోక్రోటోఫాస్, ట్రైకోడెర్మా వి రిడే, ట్రైక్లోరోఫాస్ వంటి అతి ప్రమాదకరమైన పురుగుల మం దులను వాడుతున్నారు. ఫలితంగా భూసారం తగ్గడమే కా కుండా పెట్టుబడి కూడా విపరీతంగా పెరిగిపోతుంది.
రెండోసారి వేసిన పంటకు కనీస స్థాయిలో కూడా దిగుబడి రాని పరిస్థితి నెలకొంటుంది. పొలం పరిస్థితిని అంచనా వేయకుండానే విపరీతంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. వాస్తవానికి భూసార పరీక్షల ఆధారంగా రైతులు తమ పొ లాల్లో ఏ లోపం అధికంగా ఉందో తెలుసుకొని.. దానికి సం బంధించిన ఎరువు మాత్రమే వేయాలి. కానీ, ఆయా ప్రాం తాల రైతులకు ఈ విషయమై అవగాహన లేకపోవడంతో వి చ్చలవిడిగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడానికి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. రసాయన ఎరువుల స్థానంలో వర్మీ కంపోస్టు ఎరువులు, సహజసిద్ధంగా తయారు చేసే కషాయాలను వినియోగించాలని వ్యవసాయ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.
సేంద్రియంపై దృష్టి సారించాలి..
భూసార పరిరక్షణ విషయంలో రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. రసాయ న ఎరువులు, పురుగుల మందులను మోతాదుకు మించి వాడకూడదు. రసాయనిక ఎరువు లు అధికంగా వినియోగించడంతో మానవుడి ఆరోగ్యంతోపాటు భూసారం దెబ్బతింటుంది. తెగుళ్లు మరింత ఎక్కువవుతాయి. పచ్చిరొట్ట, ఇ తర సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలి. వ్యవసాయాధికారుల సలహాలు, సూ చనలు పాటించాలి. మట్టి పరీక్షలు చేయించుకో వాలి. అధిక దిగుబడి సాధించాలి.
– చంద్రమౌళి, మండల వ్యవసాయాధికారి, పెబ్బేరు