హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవాన దేశంలో ఉగ్రదాడులకు పాల్పడొచ్చనే అనుమానంతో ఎన్ఐఏ ఇటీవ ల అనేక మందిని అరెస్టు చేసింది. ఐఎస్ఐ సహకారంతో పనిచేస్తున్న షాజాద్ భట్టి నెట్వర్ (ఎస్బీఎన్)ను విచ్ఛిన్నం చేసి, 14 రా ష్ట్రాల్లో 253 మందిని అదుపులోకి తీసుకున్నది. వీరిలో ఇద్దరిని తెలంగాణలో అరెస్టు చేశారు. 253 మందిపై యూఏపీఏ, బీఎన్ఎస్, ఆయుధాల చట్టం, ఎన్డీపీఎస్ యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
పాక్ కేంద్రంగా పనిచేస్తూ భారత్లో దాడులకు పాల్పడుతున్న ఎస్బీఎన్ ముఠా నుంచి భారీగా పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఐఈడీలు, పాకిస్థాన్ ఆయుధ ఫ్యాక్టరీల చిహ్నాలున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, లైవ్ క్యాట్రిడ్జ్లు, గూఢచర్యం కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాలు, ఇతర వస్తువులు ఉన్నాయి.