పౌరవిమానయానశాఖ కార్యదర్శిని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్
మంజూరుకు కృషిచేస్తానని ప్రదీప్సింగ్ ఖరోలా హామీ
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆరు ఎయిర్ స్ట్రిప్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌరవిమానయానశాఖ కార్యదర్శి ప్రదీప్సింగ్ ఖరోలాను సీఎం కే చంద్రశేఖర్రావు కోరారు. శనివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను ప్రదీప్సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా మామునూర్, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రల్లో ఎయిర్ స్ట్రిప్లను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో వాటి సత్వర మంజూరుకు చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర విమాయాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ కోరారు. ఎయిర్ స్ట్రిప్ల మంజూరుకు కృషిచేస్తానని ప్రదీప్సింగ్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో సీఎస్ సోమేశ్కుమార్, రోడ్లు భవనాలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్శర్మ, ఈఎన్సీ రవీందర్రావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
టీఆర్ఎస్తోనే సాగర్ అభివృద్ధి
రాజ్యసభ సెక్రటరీ జనరల్కు ‘వృక్ష వేదం’