కొనసాగుతున్న లాక్డౌన్ ఆంక్షలు
ఎక్కడికక్కడ అధికారులు, పోలీసుల తనిఖీలు
ఇంటింటా సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది
మహబూబాబాద్, మే25 : కరోనా విజృంబిస్తున్న నేప థ్యంలో వీధులన్నీ శుభ్రంగా ఉంచాలని మునిసిపల్ సిబ్బం దికి కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి సూచించారు. కొద్ది రోజులుగా ఆమె వార్డులోని సమస్యలపై ప్రత్యేక దృషి సారించారు. ఇం దులో భాగంగా బాబాగుట్ట, ఫైర్స్టేషన్ కాలనీల్లో శుభ్రం చేయించారు. శ్రీరాం భద్రయ్య కాలనీ, సింగు నర్సయ్య కాల నీ, ఎన్జీవోస్ కాలనీ, వడ్డెరకాలనీల్లో ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని సరఫరా చేయించారు. ఆయా కాలనీల్లో ఆర్పీ, అంగన్ వాడీ ఆయా ఇంటింటి సర్వే నిర్వహించారు.
పల్స్రేట్ చెక్ చేసుకోవాలి
మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అనారోగ్యం ఉంటే ఇంటింటి సర్వేకు వచ్చిన సిబ్బందితో పల్స్రేట్ చెక్ చేయిం చుకోవాలని మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం 19వ వార్డులో నిర్వహించిన ఇం టింటి సర్వేలో చైర్మన్, వైస్ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. అవసరమైన వారికి కిట్ అందజేయాలని సర్వే టీం సభ్యులకు సూచించారు. కార్యక్ర మంలో మెప్మా డీఎంసీ విజయ, రిసోర్స్ పర్సన్లు, ఏఎన్ ఎంలు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.
వైద్యులను సంప్రదించాలి
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్ర దించాలని మునిసిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్ అన్నారు. 27వ వార్డులో వైద్యసిబ్బంది చేపట్టిన ఇంటింటి సర్వేలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనోధైర్యమే మనల్ని కరోనా ముప్పు నుంచి కాపాడుతుందన్నారు. సర్వేలో డీఎంసీ అధి కారి, సీఎల్ఆర్పీ ఉమ, ఆర్పీ అరుణ, విలాసిని, సామాజిక సేవకుడు శివకుమార్, జన్ను మహేందర్ పాల్గొన్నారు.
కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి
మహబూబాబాద్ రూరల్ : కరోనా సోకిన వారు ధైర్యం గా ఉండాలని నడివాడ సర్పంచ్ పెదగాని నర్మదగుట్టయ్య అన్నారు. మంగళవారం జీపీ పరిధిలో కరోనా బాధితులను ఆయన పరామర్శించి పరామర్శించి భోజనం, పండ్లు అంద జేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీపాల్ రెడ్డి, మందుల రఘు, బుచ్చిరెడ్డి, విజయ్, సావిత్రి పాల్గొన్నారు.
కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలి
డోర్నకల్: కరోనా కట్టడిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని వ్యాపారులకు, ప్రజలకు కొవిడ్ నిబంధనలపై అవగహన కల్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ… కొవిడ్ బాధితులకు జిల్లా ఏరి యా దవాఖానలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచిం చారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సయ్యద్ ఖుర్షిద్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీ ల్దార్ వివేక్, సీఐ ఇస్లావత్ శ్రీనివాస్, ఎస్సై వాంకుడోత్ భద్రూనాయక్, మున్సిపల్ మేనేజర్ ఉదయ్, మున్సిపల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
డోర్నకల్ : కొవిడ్ నియంత్రణలో అధికారులు అప్రమ త్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి సయ్యద్ ఖుర్షిద్ అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కొవిడ్ నియంత్రణపై టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 30 గ్రామ పంచాయతీల్లో 30 మం ది స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. కార్యక్ర మంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వివేక్, సీడీపీవో , వైద్యురాలు వీరాజిత, ఎంపీవో మున్వర్బేగ్ పాల్గొన్నారు.
కొవిడ్ను నియంత్రించాలి
కేసముద్రం : కొవిడ్ నియంత్రణకు అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని ఎంపీపీ ఓలం చంద్రమోహన్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రత్యేక అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటింటి సర్వేను సంపూర్ణంగా నిర్వ హించాలని, అనుమానితులకు మందులు అందజేయా లని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సుధాకర్, తహసీల్దార్ సరితారాణి, ఎంపీడీవో రోజారాణి, ఎస్సై రమేశ్బాబు, డాక్టర్ విజయ్ కుమార్, ఈవోఈఆర్డీ పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
బయ్యారం : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీఐ తిరుపతి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడారు. కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించా ల న్నారు. అనుమతి లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చ రించారు. కార్యక్రమంలో ఎస్సై జగదీశ్ పాల్గొన్నారు.
కట్టడికి ప్రజలు సహకరించాలి
గార్ల : కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని టీఆర్ఎస్ నాయకులు, 12వ వార్డు సభ్యుడు పల్లెపంగు నాగరాజు పిలు పునిచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీవం జిపల్లిలోని ముత్యాలమ్మ గుడి వద్ద డాక్టర్ రాణాప్రతాప్ కరో నా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లా డుతూ.. ప్రజలు ఇంటి నుంచి బయటికి రావొద్దన్నారు.
ఎంతటి వారైనా చర్యలు తప్పవు
అకారణంగా బయటకు వస్తే చర్యలు తప్పవని ఎస్సై బాదావత్ రవినాయక్ హెచ్చరించారు. ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని 20 జీపీల్లో సిబ్బందితో కలిసి పర్యటించారు. ట్రైని ఎస్సై ఝాన్సీ, ఏఎస్సై నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
కొవిడ్ బాధితులకు భోజనం
కొవిడ్ బాధితులకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పానుగంటి రాధాకృష్ణ మంగళవారం భోజనం అందజేశారు. ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని 20 జీపీలకు చెందిన సుమారు 15 మందికి భోజనం, పండ్లు అందజేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.