హైదరాబాద్: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి (Rakesh Reddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు నల్లగొండ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామపత్రాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. నామినేషన్ అనంతరం స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్స్లో కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినధులు పాల్గొననున్నారు.
ఐదో రోజు 16 నామినేషన్లు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఆనుగుల రాకేశ్ ఒక సెట్, తెలుగుదేశం పార్టీ నుంచి ముండ్ర మల్లికార్జున రావు రెండు సెట్లు, ధర్మ సమాజ్ పార్టీ నుంచి బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ ఒక సెట్, నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా కర్ని రవి ఒక సెట్, స్వతంత్ర అభ్యర్థులుగా పులిపాక సుజాత రెండు సెట్లు, తాడిశెట్టి క్రాంతి కుమార్ రెండు సెట్లు, చీదల్ల వెంకట సాంబశివరావు, చీదల్ల ఉమామహేశ్వరి, అయితగోని రాఘవేంద్ర, భకా జడ్సన్, బుగ్గ శ్రీకాంత్, పాలకూరి అశోక్ కుమార్, దేశగాని సాంబశివరావు ఒక్కో సెట్ నామినేషన్లను దాఖలు చేశారు.