వర్ధన్నపేట, మే 24 : కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎ మ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. మండల కేం ద్రంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని కొవిడ్ బాధితుల కోసం ఐసొలేషన్ కేంద్రంగా మా ర్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ వైద్యులతో కలిసి ఐసొలేషన్ కేంద్రాన్ని సందర్శించారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన పడకలు, ఆక్సిజన్, ఇతర వైద్య పరీక్షలు అందించేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా సోకిన బాధితులను ఐసొలేషన్ కేంద్రానికి తరలిస్తే వైద్య సదుపాయం, వసతి ఉంటుందన్నారు. వైరస్పై నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాపాయం ఏర్పడుతుందన్నారు. సకాలంలో బాధితులు ఐసొలేషన్ కేంద్రానికి వస్తే మెరుగైన వైద్యం అందుతుందని రమేశ్ వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, కమిషనర్ గొడిశాల రవీందర్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నా యకులు, పాల్గొన్నారు.