కోస్గి, జూన్15 : రైతుబాంధవుడు రైతుబంధు పథకంతో రైతుల కళ్లల్లో చిరునవ్వు చిందిస్తూ పంటసాగుకు సహాయం చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. మంగళవారం స్థానిక శివాజీ చౌరాస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా సీఎం ప్రతి రైతు ఇంట పెద్దదిక్కయి రైతుబంధు సాయం అందిస్తున్నారని, దీంతో రైతన్నలు ధై ర్యంగా పంటసాగు చేసుకుంటున్నారన్నారు. కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయాల సంస ్థచైర్మన్ రామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి పీఏసీసీఎస్ చైర్మన్ భీం రెడ్డి, జెట్పీటీసి ప్రకాశ్రెడ్డి కౌన్సిలర్లు బాలేశ్, జనార్దన్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఓంప్రకాశ్, నాయకులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
బాలానగర్, జూన్ 15 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కమ్మద నం గోపాల్రెడ్డి అన్నారు. బాలానగర్లోని రైతువేదిక వద్ద రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేం చేశా రు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ వెంకటాచారి, సర్పంచ్ శం కర్, లక్ష్మణ్నాయక్, కాశన్న తదితరులు పాల్గొన్నారు.
రైతుబంధు సమితి ఆధ్వర్యంలో..
భూత్పూర్, జూన్ 15 : రైతుబాంధవుడు సీఎం కేసీఆర్ అని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ అన్నారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతున్న సం దర్భంగా రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్ ఆధ్వర్యంలో భూత్పూర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సింగిల్విం డో చైర్మన్ కదిరె అశోక్రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్గౌడ్, సర్పంచ్ వెంకటయ్య, నాయకులు పాల్గొన్నారు.
కోడూరులో…
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 15 : వానకాలం పంటసాగు నిమిత్తం రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని కోడూరులో రైతులు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, సర్పంచ్ శ్రీకాంత్గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దేవేందర్రె డ్డి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయు లు, ఎం పీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, వైస్ఎంపీపీ అని త, జెడ్పీ కో ప్షన్సభ్యుడు అల్లావుద్దీన్, మండల కోప్షన్ స భ్యుడు మస్తాన్, పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ మండల జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.