ఖమ్మం : మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీపీ ఇంజారపు పూజ, అడిషనల్ డీసీపీ కుమారస్వామి వాల్మీకి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహోన్నత ఇతిహాసమైన రామాయణం ద్వారా శ్రీరాముని పావన చరితాన్ని ప్రజలకు తెలియజేసిన వారి తత్త్వం మేలైన మార్గంలో ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సాంబశివరావు, సీఐ తుమ్మ గోపి, మినిస్ట్రీయల్ స్టాఫ్ ఏవో అక్తరున్నీసా బేగం, జానకిరామ్, నాగేశ్వరరావు, హానీఫ్ తదితరులు పాల్గొన్నారు.