ఎర్రుపాలెం: టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వేడుకలను మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల టీఆర్ఎస్ గ్రామ శాఖల అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మధిర ఏఎంసీ మాజీచైర్మన్ చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, వైస్ఎంపీపీ రామకోటయ్య, మహిళా అధ్యక్షురాలు శీలం ఉమామహేశ్వరి, స్థానిక సర్పంచ్ అప్పారావు, ఎంపీటీసీ మస్తాన్వలీ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.