సత్తుపల్లి రూరల్ : సత్తుపల్లి పట్టణ శివారులో వై జంక్షన్ నిర్మాణం కోసం మొదటి విడతగా రూ.2కోట్ల విలువైన చెక్కును సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ వై జంక్షన్ వద్ద అనేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది యువకులు భవిష్యత్ను అంధకారం చేసుకున్నారు. ఆ ప్రదేశంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో సింగరేణి సీఎండీ శ్రీధర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి సమస్యను వివరించినట్లు తెలిపారు.
నూతనంగా నిర్మించతలపెట్టిన వై జంక్షన్కు సింగరేణి నిధులు అందించడంతో త్వరలోనే నిర్మాణం చేపట్టి ప్రమాదాలను నివారించేలా కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ చెక్కును ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేమలతకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్.నర్సింహారావు, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జేవీఆర్ ఓసీ పీవో వెంకటాచారి, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, సింగరేణి అధికారులు సూర్యనారాయణ, పిట్ సెక్రటరీ శ్రీరామమూర్తి, శ్రీనివాస్, చెన్నకేశవరావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.