KTR | 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం.. కట్ఠించిన తర్వాతనే మీ గుమ్మానికొచ్చి ఓట్లడుగుతమన్నారు. సగం సినిమా అయిపోయింది కదా.. మరి కట్టాడా..?10 లక్షల ఇండ్లు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పాలేరు నియోజకవర్గం పాలేరు బీఆర్ఎస్ సభ, SIR శిక్షణ కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతికి సంబంధించిన వీడియోలను కేటీఆర్ ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పొంగులేటి 20 లక్షల ఇండ్లు కడితేనే ఓట్లడుగుతనన్నవ్ కదా.. ఆ మాట మీద నిలబడే సత్తా ఉందా..? పాలేరు వేదికగా అడుగుతున్నానన్నారు. మరి 20 లక్షల ఇండ్లు ఆయన రాఘవా కన్స్ట్రక్షన్స్ కడుతుందో.. లేదంటే ఈయన కడతారో.. ప్రభుత్వం కడుతుందో నాకు తెలియదు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం.. నడుస్తున్న ప్రాజెక్టులు లాక్కోవడం. మరి ఆ 20 లక్షల ఇండ్లు ఏమైనా సొంత ఆస్తులనుకుంటున్నాడా..? సొంత కంపెనీతో కట్టిద్దామనుకుంటున్నాడా.. నాకైతే తెల్వదన్నారు కేటీఆర్.
20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాకే ఓట్లు అడుగుతామని గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన వీడియో చూపించిన కేటీఆర్
రెండున్నరేళ్లలో ఎన్ని ఇండ్లు కట్టారు?
20 లక్షల ఇండ్లు కట్టకపోతే ఓట్లు అడగము అనే మాట మీద ఇప్పటికీ నిలబడే దమ్ముందా?
– కేటీఆర్ https://t.co/3Gb0IOmFms pic.twitter.com/I94na2l4Ve
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2026
Pawan Kalyan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్ కల్యాణ్
KTR | పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి : కేటీఆర్