ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం మధిర పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని టీవీఎం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
మధిర రూరల్, సెప్టెంబర్ 22: ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం మధిరలో విస్తృతంగా పర్యటించారు. ఎన్నెస్పీ గెస్ట్హౌస్లో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ను పరిశీలించారు. ట్యాంక్బండ్ పెద్దచెరువును సందర్శించారు. రూ.6 కోట్లతో నిర్మించే ఈ ట్యాంక్బండ్ చెరువును అద్భుతంగా తీర్చిదిద్దేవిధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి, చైర్మన్ మొండితోక లతకు సూచించారు. అనంతరం శ్మశానవాటికను పరిశీలించారు. తరువాత టీవీఎం పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తహసీల్దార్ సైదులు, ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి, ఎంఈవో వై.ప్రభాకర్, ఐబీ అధికారులు తదితరులు పాల్గొన్నారు