కల్లూరు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాసర ట్రిపుల్ ఐటీలో కల్లూరువిద్యార్థి ఎంపికయ్యాడు. కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వేమిరెడ్డి మణికంఠరెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం జి.మాధవరావు గురువారం తెలిపారు. ట్రిపుల్ ఐటీకి ఎంపికైన మణికంఠరెడ్డిని ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. ట్రిపుల్ ఐటీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.