కమాన్పూర్, ఏప్రిల్ 26 : అసెంబ్లీ ఎన్నికలు మొదలు ఎంపీ ఎన్నికల వరకు ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ఓట్లు దండుకోవాలని కుట్రలు చేస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలకు పథకాల ఆశ చూ పి మోసం చేసిన చరిత్ర ఆ పార్టీదేనని విమర్శించారు. నాడు పథకాల పేరిట ఆగం చేసినోళ్లే.. మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా శుక్రవారం కమాన్పూర్ మండలంలోని రొంపికుంట, నాగా రం గ్రామాల్లో ఉపాధిహామీ పని ప్రదేశాల వద్ద ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికలు వస్తేనే కాంగ్రెసోళ్లకు పథకాలు గుర్తుకొస్తాయని, ఎన్నికల తర్వాత వాటి అమలును దాటవేస్తారని విమర్శించారు. అ సెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఇంతవరకు ఎందుకు చేయలేదో ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయాలపై ఏ మాత్రం అనుభవంలేని ఓ వ్యాపారవేత్తను తీసుకొచ్చి ఎంపీ సీటులో కూర్చోబెడితే ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరా రు. స్థానికంగా ఉండే కొప్పుల ఈశ్వర్ను గెలిపించుకుందామని, వారసత్వ రాజకీయాలకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు రాచకొండ రవి, ఉప్పరి శ్రీనివాస్, మేకల సంపత్, మల్లేశ్, భూమ య్య, కొయ్యడ రవి, చిందం తిరుపతి, తాటికొండ శంకర్, కొండ వెం కటేశ్, ఆకుల గట్టయ్య, నీలం శ్రీనివాస్, రాజయ్య, సంపత్, నారాయణ, అనిల్ గౌడ్ పాల్గొన్నారు.