Electricity AE | కారేపల్లి, ఫిబ్రవరి 18 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు పరిసర ప్రాంతాల్లో ఇవాళ జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ విస్తృతంగా పర్యటించారు. స్థానిక విద్యుత్ శాఖ ఏఈపై ఆ ప్రాంత రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బోరు, బావుల మీద ఆధారపడి పంటలు సాగు చేసుకుంటున్నామని కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల నష్టపోతున్నామని కలెక్టర్ ముందు వాపోయారు.
ఈ ప్రాంతంలో ఎక్కువగా విద్యుత్ హై, లో వోల్టేజ్ సమస్యలు వస్తాయన్నారు. ఏఈ స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం వల్ల కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తులకు ఆలస్యం అవుతుందన్నారు. ఫోన్లలో సంప్రదించాలని ప్రయత్నించినా స్పందించడం లేదని ఆరోపించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా కృషి చేయాలని కలెక్టర్ను వేడుకున్నారు.
దీంతో స్పందించిన కలెక్టర్ వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న విద్యుత్ శాఖ ఉన్నత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు తాము పనిచేసే చోట విధుల నిర్వహణ పట్ల స్థానిక ప్రజల మన్ననలు పొందాలని అధికార యంత్రాంగానికి కలెక్టర్ సూచించారు.
State Level Select | రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కోటపల్లి ఆశ్రమ విద్యార్థిని ఎంపిక
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు