ఇల్లెందు : ఆత్మహత్యకు పాల్పడిన మృతుడికి జిల్లా పరిషత్ కోరం కనకయ్య నివాళులర్పించారు. బుధవారం మండల పరిధిలోని మామిడిగూడెం గ్రామ పంచాయతీ తీగలంచకు చెందిన లారీ డ్రైవర్ నాగరాజు (45)ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కోరం కనకయ్య మృతుని భౌతికకాయాన్ని సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ వెంట ఎంపీటీసీ మండల రాము, హేమంత్ ట్రాన్స్పోర్టు యజమాని చిట్టిబాబు, నాయకులు సాంబమూర్తి, భిక్షం, వెంకటేశ్వర్లు, నాగార్జున, ధర్మయ్య, సతీష్ తదితరులు ఉన్నారు.