దమ్మపేట :గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచించారు. మండల పరిధిలో మొద్దులగూడెం పంచాయతీలోని తడి, పొడి చెత్త బుట్టలను మెచ్చా పంపిణీ చేసారు. ఈసందర్బంగా మెచ్చా మాట్లాడుతూ గ్రామాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
ఈ బాధ్యతను పంచాయతీ పారిశుద్య సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ఈ దిశగా పనిచేయాలని సర్పంచ్లకు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాము, ఎంపీటీసీ దొడ్డా నాగమణి, నాయకులు దొడ్డా చినసత్యం, మాధవరావు, మోరంపూడి గోపాలరావులు పాల్గొన్నారు.