Bhadadri Kothagudem | దమ్మపేట రూరల్, జూలై 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని ఎంఈఈ ప్లాంట్ వద్ద వేడి నీరు ప్రవహించే పైప్పు మరమ్మతు చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ 80 డిగ్రీల సెల్సియస్ వేడినీరు శరీరంపై పడటంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన కార్మికులను శివరామకృష్ణ, గణేశ్గా గుర్తించారు. గాయపడిన వీరికి ప్రాథమిక చికిత్స అందించి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.