చండ్రుగొండ: కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పునాదిరాళ్లని అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. సోమవారం రావికంపాడు గ్రామానికి చెందిన బాదావత్ బిక్షం(55) కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…బాదావత్ బిక్షం మరణం పార్టీకి తీరనిలోటని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు. టీఆర్ఎస్ పార్టీలో అన్నివర్గాల ప్రజలకు చోటు ఉంటుందని, అందరి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అభివృద్ది, సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ రన్య, టిఆర్ఎస్ నాయకులు భూపతి రమేష్, అబ్బాస్అలీ, మంద అనిల్, శ్రీరామ్, తదితరులు ఉన్నారు.