పాల్వంచ, జూన్ 01 : పాల్వంచ పట్టణ, మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు పాల్వంచలోని గల బుక్స్ గోడౌన్స్ నుండి మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్మూర్తి నూతన విద్యా సంవత్సరం 2026-27 కు సంబంధించిన పాఠ్య పుస్తకాలను సోమవారం అందజేశారు. పాఠశాలలు తెరవక ముందే పాఠ్య పుస్తకాలను జిల్లా గోడౌన్ నుండి పాల్వంచకు తీసుకొచ్చి అందివడం జరిగింది. పాల్వంచ మండలంలో ఉన్న 75 మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్, కేజీబీవీ పాఠశాలలకు ఎంఈఓ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యాశాఖ ఈ సంవత్సరం అన్ని ప్రభుత్వ పాఠశాలకు UDISE ప్రకారం పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలను ముందుగానే సిద్ధం చేసి పంపించడం జరిగిందని తెలిపారు. జూన్ 12వ తేదీన పాఠశాల ప్రారంభం రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.