భద్రాచలం :భద్రాచలశ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి ఉత్సవ పెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేక తిరుమంజనం జరిపారు. అలాగే శ్రీరామచంద్రునికి ఆరాధ్య దైవమైన రంగనాయకుల గుట్టపై వేంచేసిన శ్రీరంగనాథ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన,సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాలు నిర్వహించారు.
అనంతరం శ్రీసీతారామ, లక్ష్మణ ఉత్సవమూర్తులను బేడా మండపంలో వేంచేపు చేసి ముందుగా విశ్వక్సేన ఆరాధన, ఫుణ్యఃవచనం చేశారు. అర్చకుల వేద మంత్రాల నడుమ కన్యాదానం, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల వేడుకతో శాస్త్రోక్తంగా స్వామివారికి నిత్య కల్యాణం జరిపించారు. కల్యాణ దాతలకు రామయ్య ప్రసాదాలను అందజేశారు.