జూలూరుపాడు: అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని ఏఫ్డీవో అప్పయ్య అన్నారు. అడవుల పరిరక్షణ, జంతుగణన కార్యక్రమంలో భాగంగా మండలంలోని సూరారం, గుండెపుడి, రాజారావుపేట, పాపకొల్లు , నల్లబండబోడు బీట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం స్ధానిక అటవీశాఖ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మండలంలోని పాపకొల్లు గ్రామ సమీపంలోని గుట్టల సంరక్షణ కోసం మూడు కిలో మీటర్ల మేర మీటర్ వెడల్పుతో ట్రెంచ్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.
80 హెక్టార్లలో మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. జూలురుపాడు రేంజ్ పరిధిలో జంతుగణన పూర్తయిందని ఆయన వెల్లడించారు. వీరి వెంట రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.