దమ్మపేట: మండల పరిధిలోని పట్వారిగూడెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోలార్ లైట్లను పంపిణీ చేశారు. పాఠశాల హెచ్ఎం పి.జగపతి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్ధం వీటిని పంపిణీ చేయడం జరిగిందని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, సర్పంచ్ మొగిలి అంజలి, ఉపసర్పంచ్ రెడ్డిమళ్ల నాగయ్య, ప్రాథమికపాఠశాల హెచ్ఎం వెంకటేశ్వరరావు, గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.