మణుగూరు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా వార్షిక లక్ష్యాన్ని అధిగమించాలని సీఅండ్ఎండీ శ్రీధర్ అన్నారు. సోమవారం ఆయన ఏరియా జీఎం జక్కం రమేశ్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఏటా పెరుగుతున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమిస్తూ సరికొత్త రికార్డు సృష్టిస్తున్న మణుగూరు ఏరియా ఈ ఏడాది కూడా ఇయర్ టార్గెట్ ను చేరేలా కాంట్రాక్ట్ కంపెనీలను సమన్వయపరుచుకుంటూ పనులు చేసుకోవాలన్నారు.
అనంతరం జీఎం రమేశ్ మాట్లాడుతూ..ఏరియాలో చేపట్టిన కరోనా నివారణ చర్యలు, ఉత్పత్తి లక్ష్యసాధనకు తీసుకుంటున్న చర్యలను, సెప్టెంబర్ ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో అధికారులు లలిత్కుమార్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, ఫిడ్జరాల్డ్, లక్ష్మీపతిగౌడ్, శ్రీనివాసచారి, వెంకట్రావు, సురేశ్, రమేశ్, వెంకటరమణ, వెంగళరావు, సాయిల సురేశ్ తదితరులు ఉన్నారు.