భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా రామాలయం గాలిగోపురానికి అభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన,సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీసీతా రామలక్ష్మణ ఉత్సవమూర్తులను బేడా మండపంలో వేంచేపు చేసి ముందుగా విశ్వక్సేన ఆరాధన, ఫుణ్యఃవచనం చేశారు. అనంతరం అర్చక స్వాములు వేద మంత్రోచ్ఛరణల నడుమ రామయ్య వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు.