దమ్మపేట: మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్ల శ్రీరాములు కుమారుడు గోపి ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోమవారం గట్టుగూడెంలోని టీఆర్ఎస్ నేత శ్రీరాములు నివాసానికి వెళ్లి కుమారుడు గోపి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం శ్రీరాములుతోపాటు ఆయన కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వెంట సర్పంచ్తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.