చుంచుపల్లి : జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు పోడు భూముల సమస్యలు పరిష్కారం, అటవీ భూముల పరిరక్షణ కార్యక్రమంపై ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వనమా కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, వీఆర్వో, వీఆర్ఏ, ఐకేపీ సీసీలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే పోడు భూముల హ్యాబిటేషన్లలో గ్రామసభలు నిర్వహించి ఎఫ్ఆర్సీ కమిటీలు ఏర్పాటు చేసి ఆ తర్వాత పోడు భూముల విషయంలో చర్యలు ఏ విధంగా చేపట్టాలనే అంశంపై సమావేశం నిర్వహించి అందరికీ దిశానిర్దేశం చేశారు.
వీటికి సంబంధించిన తీర్మానాలు, ప్రఫార్మాలు ఏ విధంగా నిర్వహించాలని చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో సకినాల రమేష్, ఎంపీవో సత్యనారాయణ, డీఆర్వో రామకృష్ణ, ఆర్ఐ కాంతారావు, వీఆర్వో ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శులు చెన్నకేశవులు,హనుమంతు,రఘు, వసంత, అనురాధలు పాల్గొన్నారు.