దమ్మపేట: నూతనంగా నియమితులైన బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావును జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కట్టా మల్లికార్జున్లు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ కమీషన్ చైర్మన్కు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం జిల్లా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తానని, జిల్లాలో బీసీల స్థితిగతులపై కూలంకషంగా తెలుసుకుని ప్రభుత్వం ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీఇచ్చినట్లు వారు తెలిపారు.