– ఏడుగురిపై కేసు నమోదు
బూర్గంపహాడ్, జూలై 17 : అక్రమంగా డంప్ చేసిన ఇసుకను తోడుతున్న జేసీబీతో పాటు ఇసుక తరలిస్తున్న లారీని గురువారం రాత్రి పట్టుకున్నట్లు బూర్గంపహాడ్ పోలీసులు తెలిపారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మీపురంలో బుడ్డగూడెం నుండి డంప్ చేసిన ఇసుకను జేసీబీ సహాయంతో లారీలో లోడ్ చేసి తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు సిబ్బందితో అక్కడకు వెళ్లి లారీ, జేసీబీని స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా దీనికి కారణమైన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, అక్రమంగా ఇసుక తరలించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.