భద్రాద్రి కొత్తగూడెం : ప్రణాళికతో చదివితే తప్పక విజయం మీ సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్, ఎస్పై పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థుల కోసం ఏర్పాటు ఉచిత కోచింగ్ కేంద్రాన్ని ఎస్పీ సునీల్ దత్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..సిలబస్ ను ఆకలింపు చేసుకుంటూ ప్రణాళిక ప్రకారం సన్నద్ధత కావాలని నిరుద్యోగులకు సూచించారు. మన జిల్లా యువత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉచిత కోచింగ్ కేంద్రం ఏర్పాటు చేశాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఎంత మంది పరీక్ష రాస్తున్నారనేది ముఖ్యం కాదనిక, మనం ఎంత మంచిగా ప్రిపేర్ అయితో అంత బాగా పరీక్ష రాయగలుగుతామన్నారు. పరీక్షలకు సన్నద్ధతలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కోచింగ్ అందిస్తున్న మేధా స్టడీ సర్కిల్ శివప్రసాద్ను కలెక్టర్ అభినందించారు.
కార్యక్రమంలో ఏఎస్సీ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ పున్నంచందర్, అధ్యాపకులు శివప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సోములు, కామరాజు, దామోదర్, సత్యనారాయణ, పాల్వంచ ఎస్ఐ నరేష్, తదితరులు పాల్గొన్నారు.