భద్రాచలం:తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో 9నెలలు ఆన్లైన్ విధానంలో శిక్షణ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
రూ. 3లక్షలలోపు సంవత్సర ఆదాయం ఉన్న అభ్యర్థులు అక్టోబర్17లోగా http;//studycircle.cgg.gov.in, twd.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 6281766534నెంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు.