అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ నిబంధనల మేరకే ఎరువులను విక్రయించాలని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుఖాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, గోడౌన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ తాతారావు మాట్లాడుతూ..డీలర్లు దుఖాణాల్లో ధరల పట్టికలను, మందులు, ఎరువుల నిల్వల వివరాల పట్టికలను ప్రదర్శించాలన్నారు. ఎరువులు, మందులను ఎమ్ఆర్పీ ధరలకు మించి అమ్మితే చర్యలు తప్పవన్నారు. అంతేకాదు నకిలీ మందులనువిక్రయిస్తే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఏవో అనూష, ఏఈవోలు పాల్గొన్నారు.