పాల్వంచ, జూలై 24 : విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ ఏ కాలనీలో గల పిఎం సిరి (జడ్.పి.హెచ్.ఎస్) బాలికల ఉన్నత పాఠశాలను ఆమె బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయుల ఫేస్ రికగ్నైజేషన్ ( ఎఫ్ ఆర్ ఎస్) ఉపాధ్యాయుల, విద్యార్థుల అటెండెన్స్ ను పరిశీలించారు. పాఠశాలకు హాజరైన విద్యార్థులు అందరూ కూడా ఎఫ్ ఆర్ ఎస్ నమోదు చేయాలని, అలాగే పాఠశాలకు సమయ పాలన పాటించాలన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉచితంగా అందజేసిన పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలను తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ లో వాటిని నమోదు చేయాలని తెలిపారు. పాఠశాలకు క్రమం తప్పకుండా విద్యార్థులు వచ్చే విధంగా, విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులకు కనీస సామర్ధ్యాల పెంపుదల కోసం ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతిలో విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించారు. ఆమెతో పాటు మండల విద్యాశాఖ అధికారి ఏ.శ్రీరామ్ మూర్తి, పాఠశాల హెచ్ఎం రమాదేవి ఉన్నారు.