జూలూరుపాడు: మండలంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే తొమ్మిది మందిపై దాడి చేసి గాయపరిచాయి. పడమటనర్సాపురం గ్రామానికి చెందిన హర్షిత, జాన్సీ, సూరారం గ్రామానికి చెందిన శ్రీను, బలరాం, కృష్ణ జూలురుపాడుకు చెందిన రామయ్య, శ్రీనాథ్ మాచినేనిపేటకు చెందిన వెంకట్లపై పిచ్చికుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన వారిని స్ధానికులు ప్రభుత్వాసు పత్రికి తరలించి చికిత్స అందించారు.