కొత్తగూడెం:గ్రంథాలయంపై ఆధారపడి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థుల మేథోశక్తిని మరింత గా పెంచడమే ఏకైక లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయం ఆవరణలో గ్రంథాలయ అభివృద్ధిపై అనేక అంశాలను చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థినీ, విద్యార్థులకు కావాల్సిన పోటీ పరీక్షల పుస్తకాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతూ విద్యార్థులు ఉద్యోగాలు సాధించేందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
దేవాలయం లాంటి గ్రంథాలయాలపై ఆధారపడి చదువుతున్న వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో శ్రీనివాసరావు, ధన్రాజ్, కార్యదర్శి మంజువాణి, అర్జున్, సిబ్బంది నవీన్లు పాల్గొన్నారు.