రామవరం : సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం గౌతంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్లో డిపార్ట్మెంటల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇంచార్జి డీజీఎం పర్సనల్ కిరణ్బాబు, ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్లు పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. క్రీడాకారులకు సంస్థ అన్ని విధాలుగా సహకరిస్తుందని, వారు నైపుణ్యంతో క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
ఇందులో భాగంగా పీవీకే 5 గ్రూప్, జీకేవోసీ గ్రూప్ మధ్య పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో జీకేవోసీ గ్రూప్ 139 రన్స్ చేయగా, పీవీకే 5 గ్రూప్ 16 ఓవర్లలో 8 వికెట్లు తేడాతో లక్ష్యం చేధించి గెలుపొందింది. ఈ కార్యక్రమంలో జీకేవోసీ సీనియర్ పీవో శ్రావణ్, అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైజర్ పాస్నెట్, కెప్టెన్లు సాగర్, నాగమోహన్, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఎస్కే గులాం, శేఖర్, క్రీడాకారులు పాల్గొన్నారు.