కొత్తగూడెం:ఢిల్లీలోని ఘజియాబాద్ సింగుబోర్డర్లో మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తూ జరుగుతున్న రైతుల ధర్నాకు సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఇఫ్టూ నాయకులు మద్దతు తెలిపారు. ఇఫ్టూ జాతీయ నాయకులు టి.శ్రీనివాస్, కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్నలు పాల్గొని మాట్లాడుతూ…దేశానికి అన్నం పెట్టే రైతును గతంలో జై జవాన్ జై కిసాన్ అని పొగిడారు.
ఇప్పుడు మాత్రం దేశ ప్రధాని రైతులను చలిలో, ఎండలో, వానలో తడుస్తూ రోడ్డెక్కి ఆందోళన చేసేలా తన పరిపాలన కొనసాగిస్తున్నాడన్నారు. దేశంలో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వర్గాన్ని కడుబానిసలుగా చేసే కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ను చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్. సంజీవ్, షేక్ యాకూబ్ ఆలీ, సంజీవ్ , బ్రహ్మానందం, యాదగిరి, గౌస్, రమేష్, శోభ, రజిత, మనోజ్లు పాల్గొన్నారు.