టేకులపల్లి, మార్చి 12 : కోయగూడెం ఓసీలో పనులు నాణత్యతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ముందుకు సాగాలని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సంస్థకు చెందిన కార్పొరేట్ ఉన్నతాధికారులు డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్వీ.సూర్యనారాయణ, జీఎం (సీపీపీ) ఏ.మనోహర్, జీఎం (క్వాలిటి) రవికుమార్ అన్నారు. టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ను గురువారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా కేవోసీలో వ్యూ పాయింట్ నుండి పని స్థలాలను అక్కడ జరుతున్న పనులు పరిశీలించారు. ప్రాజెక్ట్లో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనులను భద్రతా చర్యలు, యంత్రాల పనితీరు అంశాలను అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.
అంతేకాక బొగ్గు నాణ్యత సామర్థ్యం పెంచే జీ 19 బొగ్గు ఉత్పత్తి అయ్యేలాగా చూడాలని, ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి తీయాలని అన్నారు. బొగ్గు రవాణకు ఎటుంటి అటంకలు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఏరియా జీఎం వి.కృష్ణయ్య, కేవోసీ పీఓ గోవిందరావు, కేఓసీ మేనేజర్ శ్రీనివాసరావు, క్వాలిటీ మేనేజర్ రాందాస్, సెక్యూరిటీ అధికారి అంజిరెడ్డి పాల్గొన్నారు.

‘రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలి’