భద్రాచలం, ఏప్రిల్ 01 : వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా హామీల అమలులో విఫలం అయ్యారని, ప్రజల్ని మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమదు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకుడు మానే రామకృష్ణ అన్నారు. ఈ మేరకు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్గా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి ప్రజల్ని మోసం చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఆకోజు సునీల్కుమార్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమ్కుమార్, గుంజ ఏడుకొండలు, పార్టీ నాయకులు కాపుల సూరిబాబు, తాండ్ర ప్రసాద్, యువజన నాయకులు కీసరి యువరాజు, కొల్లిపాక శివ, సోషల్ మీడియా నాయకులు ఇమంది నాగేశ్వరరావు, రావూరి రవి కిరణ్, నాయకులు కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మీ, ఏలూరు ప్రియాంక పాల్గొన్నారు.