భద్రాచలం: ట్రైకార్ ఆర్థిక స్వావలంబన పథకం ద్వారా ఐటీడీఏ ఆధ్వర్యంలో మంజూరు చేసే స్వయం ఉపాధి పథకాలతో గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ తెలిపారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరంలో గిరిజన లబ్ధిదారులకు ట్రైకార్ ఋణాలు మంజూరు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ ఐటీడీఏ భద్రాచలం పరిధిలో ట్రైకార్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కోసం గతంలో ధరఖాస్తు చేసుకున్న గిరిజన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించి, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, అటువంటివారికి మాత్రమే గిరిజన అభివృద్ధి ఫలాలు అందుతాయని ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి స్వయం ఉపాధి పథకాలు మంజూరు చేసి గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చూడాలని ఏపీఓ జనరల్ ప్రత్యేక అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు సుజాత, జీసీసీ డీఎం కుంజా వాణి, జేడీఎం హరికృష్ణ, ఉద్యానవన శాఖ అధికారి ఉదయ్కుమార్, ఏటీడీఏ భద్రాచలం నరసింహారావు, ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.