రుద్రంపూర్, మే 14 : బీసీ ఓబీసీ కొత్తగూడెం ఏరియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియా బ్రాంచ్ సెక్రటరీ సకినాల సమ్మయ్య అధ్యక్షతన నూతనంగా పర్సనల్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన ఎల్. తిరుపతిని శాలువాతో సన్మానించి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తిరుపతి సహకారం అందించాలని ఆకాంక్షించారు. సంస్థ అభివృద్ధితో పాటు కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అనంతరామయ్య, మురళి, సందబోయిన శ్రీనివాస్, మెంగని అశోక్, వల్లాల సాంబమూర్తి, పిల్లి భరత్, వాసంపల్లి రాహుల్, లగ్గాల అజయ్, వలబోజు రమేష్ కుమార్, దాసరి రవికాంత్, అమృత జనార్దన్ రావు, నాలె మల్లికార్జున్, నరసింహమూర్తి, వేల్పుల వినయ్, బింగి గోపాల్, బెజ్జంకి శ్రీనివాస్, కార్తీక్ చంద్ర యాదవ్ పాల్గొన్నారు.