భద్రాచలం : పర్ణశాలమండల పరిధిలోని పెద్దనల్లబల్లి రైతువేదికలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఆపివేసిందని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందన్నారు.
వేసవిలో వరి కాకుండా పంటమార్పిడి విధానంలో ఆరుతడి పంటలైన మినుము, పెసర, కందులు, నువ్వులు సాగుచేయాలని, వీటి వల్ల తక్కువ పెట్టుబడితో పాటు ఎక్కువ లాభాలు సాధించవచ్చన్నారు. యాసంగి సాగు పంటలపై వ్యవసాయాధికారులను రైతులు సంప్రదించి అనుకూలమైన పంటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో నవీన్కుమార్, ఏఈవో హసీనా, రైతులు పాల్గొన్నారు.