అశ్వారావుపేట: పాము కాటుకు గురై మహిళ మృతి చెందింది. అశ్వారావుపేట మండలంలోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన అలా లక్ష్మీ (45) పొలంలో పశువులను మేపేందుకు వెళ్ళింది. ఆమె పొదల వద్ద కూర్చొని ఉండగా పొదల్లో నుంచి బయటకు వచ్చిన పాము ఆమెను కాటేసింది. పామును చూసిన లక్ష్మీ కాటు వేసినట్లు గుర్తించి సమీపంలోని గ్రామస్తులకు చెప్పి స్పృహ కోల్పోయింది. వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు లక్ష్మీ మృతి చెందినట్లు నిర్ధారించారు.