భద్రాచలం: భద్రాద్రి సీతారామచంద్రస్వామివారిని కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్ రాజు శనివారం దర్శించుకున్నారు. రామాలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని భద్రుని కోవెలను, లక్ష్మి తాయారమ్మ వారిని, ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆలయ సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్, పట్టణ సీఐ స్వామి తదితరులు పాల్గొన్నారు.