దమ్మపేట రూరల్, మే 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. జిల్లాలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో పని చేసేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా దర్బా గ్రామం నుంచి కొంతమంది కూలీలు వచ్చారు.
పనిలో భాగంగా నట్ బ్రేకింగ్ యూనిట్లో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు దశమి (22) కాలు కన్వేయర్ బెల్టులో పడింది. తీవ్ర రక్తస్రావమై గాయపడిన దశమిని తొలుత ఖమ్మం జిల్లా సత్తుపల్లి దవాఖానకు, తరువాత ఖమ్మం జిల్లా కేంద్ర హాస్పిటల్కు తరలించారు. దశమి చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలు అవివాహిత. ప్రమాదంపై పోలీసులకు సమాచారాన్ని అందజేశామని ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్ తెలిపారు.